***
“ప్రజలకి కలిగే అసౌకర్యాలకి, పడే బాధలకీ ప్రభుత్వాల, నాయకుల అసమర్ధత కారణం కాదు. పాలసీ, ప్లానింగ్ సరిగా లేకపోవటం కాదు. అంతటికీ మూలం వాస్తు,” అని నేతలు చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్. “మేం చేసేదంతా చేసేస్తున్నాం కానీ రాష్ట్ర వాస్తు బావుండక ప్రజలు కష్టాలు పడుతున్నారు. పెట్రోలు, ఉల్లిపాయల ధరలు; రైతుల ఆత్మ హత్యలు, అత్యాచారాలు; నేరాలు ఘోరాలు, కుంభ కోణాలు అన్నీ వాస్తు సరిగా లేకే,” అని ఎవరో ఒక మంత్రి వర్యుడు త్వరలో అనకపోడు. “కేంద్రంనుంచి ప్రత్యేక పాకేజీలు రాకపోవడానికి వాస్తు దోషాలే కారణం,” అని కూడా తేల్చేయవచ్చు. జస్ట్ ఏ మాటర్ ఆఫ్ టైమ్. అసలు ప్రాబ్లెం రాష్ట్ర విభజన ముహూర్తంలో ఉందని కూడా అనుమానం. గులాం నబీ అజాద్ గారు ప్రత్యేక రాష్ట నిర్ణయానికి ఉగాది నుంచీ పోలాల అమావాస్య, అట్లతద్ది వరకూ రకరకాల ముహూర్తాలు కన్సిడర్ చెయ్యడం గుర్తుందా?
చీటికీ మాటికీ, అయినదానికీ, కానిదానికీ పిల్స్ వేసేవాళ్ళు ఇలాంటి అనవసరపు వ్యక్తిగత నమ్మకాల ఆధారంగా జరిగే వృధాఖర్చుల్ని ఆపమని ఓ పిల్ వేయ్యోచ్చుగా. వెయ్యరు. మూఢ నమ్మకాలు పెరిగిపోయాయని గోల చేసే మీడియా వాళ్ళేమో వాస్తులు, feng shui, వారఫలాలు అంటూ ప్రత్యేక పేజీలు పెడతారు. (ముందు మీడియా వాళ్ళందరి వాస్తులూ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయని అభిజ్ఞవర్గాల ఉవాచ)
నేతలు చేసే పనులూ, కుహనా పండితులు చెప్పే శాస్త్రాలూ…
View original post 1,003 more words