మొన్న ఈనాడులో ఆరు నెలలు తీరని కలలు టైటిల్ తో వచ్చిన వార్త – “ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి మంగళవారానికి ఆరునెలలయింది. విభజన చట్టంలో ఎపీకిచ్చిన హామీల అమలును గుర్తు చేసుకొనే ప్రతి ఒక్కరి నుంచి నిట్టూర్పే వినిపిస్తోంది….” – ఇలా సాగిన కధనం చివరికి విభజన బిల్లు ఆమోద సమయంలో రాజ్య సభలో మన్మోహన్ ఇచ్చిన హామీలని గుర్తు చేస్తూ ముగిసింది. మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడలేదు కానీ హామీలు నెరవేర్చడంలో తాత్సారం గురించి సణుగుడు ఉంది. ఈ సణుగుడు తీవ్ర విమర్శగా మారుతుందా లేదా అనేది ఎనీబడీస్ గెస్.
ఈ మధ్య అమిత్ షా రెడిఫ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది వింటే, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అనే అలవాటు మనకుంటే ఆలారం బెల్స్ మోగుతాయి. “మా పార్టీని బలోపేతం చెయ్యడమే మా అజెండా. ఎక్కడెక్కడ పార్టీకి బలం తక్కువగా వుందో అక్కడ దాన్ని పటిష్టం చేస్తాం అంటే కానీ ఇతర పార్టీలకి వ్యతిరేకంగా పనిచేసే నెగెటివ్ అజెండా మాకు లేదు,” అన్నాడు. మహారాష్ట్ర ఎలక్షన్ల ప్రచారంలో మోడీ, “సంకీర్ణ ప్రభుత్వాలకి కాలం చెల్లింది,” అన్నాడు. అన్నీ కలిపి చూస్తే బీజేపీ ప్రాంతీయ పార్టీలకి ఓ మెసేజ్ ఇచ్చినట్టే ఉంది. నేనే ఒక ప్రాంతీయ పార్టీ అధినేతనైతే అమిత్, మోడీల మాటలు నెగెటివ్ సెన్స్ లోనే అర్ధం చేసుకుంటా. పైకి చెప్పను కానీ నా జాగ్రత్తలో నేనుంటా.
ఇప్పుడే…
View original post 815 more words